ఇంటర్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థుల విజయభేరి

ABN , First Publish Date - 2021-07-24T05:01:48+05:30 IST

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథ్‌ వెల్లడించారు.

ఇంటర్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థుల విజయభేరి
విద్యార్థులను అభినందిస్తున్న శ్రీకూర్మనాథ్‌ తదితరులు

గుంటూరు(విద్య), జూలై 23: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథ్‌ వెల్లడించారు. శుక్రవారం వడ్లమూడిలోని కళాశాలలో ఆయన విద్యార్థులను అభినందించారు. తమ విద్యార్థులు బీటీఎస్‌ సంతోష్‌ 990 మార్కులు, బీవీ సాయిప్రమోద్‌ 988, ఈ.హేమంత్‌కుమార్‌రెడ్డి, పీపీవీ అఖిల్‌కస్యప్‌ 986, సీహెచ్‌ అనిల్‌ వెంకటసాయి 981, వెనిగండ్ల భార్గవి, సర్ర మానస, కొండవీటి గాయిత్రి 980 మార్కులు సాఽధించారని తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ జె.మోహనరావు, మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎల్‌.జయసుధ, విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య తదితరులు అభినందించారు.


Updated Date - 2021-07-24T05:01:48+05:30 IST