ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , First Publish Date - 2021-09-19T05:11:32+05:30 IST

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్‌, ఒకే షనల్‌ విభాగాల్లో 32,267 మంది విద్యార్థులకు 20,617 మంది హాజరయ్యారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 18 :ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్‌, ఒకే షనల్‌ విభాగాల్లో 32,267 మంది విద్యార్థులకు 20,617 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 32,505 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 149 మంది మాత్రమే హాజరయ్యారని ఆర్‌ఐవో చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం నుంచి సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాల మూల్యాంకణాన్ని ఏలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రారంభిస్తున్నట్టు వివరించారు. సంబం ధిత సబ్జెక్టుకు నియమితులైన అధ్యాపకులు ఆదివారం ఉదయం 9 గంటలకు స్పాట్‌ క్యాంప్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-09-19T05:11:32+05:30 IST