వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే...
ABN , First Publish Date - 2022-06-28T06:56:32+05:30 IST
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే భర్తను హత్య చేసిన భార్యను, సహకరించిన మరో వ్య క్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
భర్తను చంపిన భార్య
సూత్రధారి అరెస్టు
శాలిగౌరారం, జూన 27: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే భర్తను హత్య చేసిన భార్యను, సహకరించిన మరో వ్య క్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులకు సోమవారం వెల్లడించారు. మండలంలోని చి త్తలూరుకు చెందిన సారికకు నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్(29)తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల కిందట బతుకుదెరువ కోసం కిరణ్ భార్యతో సారికతో కలిసి హైదరాబాద్కు వె ళ్లాడు. అక్కడ సారిక ఆస్పత్రిలో ఆపరేషన టెక్నీషియనగా పనిచేస్తుండగా, అందులో హౌస్కీపింగ్ కాంట్రాక్టర్ రొడ్డ మల్లే్షతో కిరణ్ కు పరిచయం ఏర్పడింది. మల్లేష్ స్వస్థలం యాదాద్రిభువనగిరి జి ల్లా అడ్డగూడూరు మండలం ఎల్దేవి గ్రామం. ప్రస్తుతం మన్సూరాబాద్లో ఉంటున్నాడు. పరిచయం నేపథ్యంలో కిరణ్ ఇంటికి మల్లే ష్ వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో కిరణ్ భార్య సారికతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కిరణ్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ విషయంలో పెద్దమనుషుల సమక్షంలో సర్దిచెప్పి పంపించారు. ఐదు నెలల క్రితం సారి క తన పిల్లలను తీసుకుని తల్లిగారి ఊరైన శాలిగౌరారం మండలం చిత్తలూరుకు వచ్చి ఉం టుంది. రొడ్డ మల్లేష్ భార్య నెల రోజుల కిందట అదృశ్యమైన విషయంలో మా చర్ల కిరణ్పై అనుమానం కలిగి మల్లేష్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయమై మల్లేష్ తన భార్యను కిరణ్ తీసుకెళ్లాడని సారికకు ఫోనలో చెప్పాడు. సారిక తన భర్త వేధింపులు ఎక్కువయ్యాయని మల్లే్షతో చెప్పింది. కిరణ్ను చంపితే ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డు ఉండద ని, కలిసి ఉండవచ్చని నిర్ణయించుకున్నారు. పక్కాగా ప్లాన వేసుకు ని ఈ నెల 20న కిరణ్ను సారిక ఇంటికి పిలిపించుకుని మర్యాద చేసి పడుకున్న తర్వాత తలపై బండరాయితో రెండుసార్లు కొట్టి చంపింది. అనంతరం విషయాన్ని మల్లేష్కు చెప్పి పరారైంది. కిరణ్ సోదరుడు కిషోర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఉప్పల సతీష్ కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా సారికతో పాటు హత్య ప్లానకు సహకరించిన మల్లే్షను అరెస్టు చేసి రి మాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్ఐ సతీ్ష ఉన్నారు.