పాఠశాలలపై చర్యలొద్దు : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-09-29T18:01:39+05:30 IST

విద్యా హక్కు చట్టం (Right to Education Act) విషయంలో పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

పాఠశాలలపై చర్యలొద్దు : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Amaravathi : విద్యా హక్కు చట్టం (Right to Education Act) విషయంలో పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకొవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు (Interim orders of the High Court) జారీ చేసింది. విద్యాహక్కు చట్టం కింద 25 శాతం సీట్ల కేటాయింపు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై యునైటెడ్ ప్రైవేట్ విద్యాసంస్థలు (United Private Educational Institutions) హైకోర్టును ఆశ్రయించాయి. విద్యాసంస్థల తరపున మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు .. విద్యాహక్కు చట్టానికి పూర్తి విరుద్ధమని శ్రీ విజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇచ్చిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (Standard Operating Procedure)‌కు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఈ ఉత్తర్వుల ద్వారా అనేక పాఠశాలలకు గుర్తింపు రద్దు చేస్తామని నోటీసులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్ వేసిన వారి పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-09-29T18:01:39+05:30 IST