రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-06-22T05:57:17+05:30 IST

తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది.

రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగాసనాలు వేస్తున్న డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ

విశాఖపట్నం, జూన్‌ 21: తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. వన్‌ వరల్డ్‌, వన్‌ హెల్త్‌ నినాదంతో రైల్‌ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమానికి డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా హాజరై సుమారు గంటసేపు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. 

రైల్‌ గార్డెన్‌ ప్రారంభం

తొలుత ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలో అభివృద్ధి చేసిన రైల్‌ గార్డెన్‌ను డీఆర్‌ఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం అక్షయ్‌ సక్సేనా, సీనియర్‌ డీపీవో కేఎస్‌ఎన్‌ రాజు, ఇతర బ్రాంచి అధికారులు, సివిల్‌ డిఫెన్స్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బందితోపాటు రైల్వే క్రీడాకారులు, వాల్తేరు రైల్వే మహిళా సంక్షేమ సంఘం ప్రతినిధులు షాలిని శ్రీవాస్తవ, మధులిక సక్సేనా తదితరులు పాల్గొన్నారు. కాగా, యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి  డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాస్తవ హాజరై హౌస్‌ కీపింగ్‌ కార్మికులు, స్టేషన్‌ సహాయక సిబ్బందికి రేషన్‌ సరకులు పంపిణీ చేశారు. 

Updated Date - 2021-06-22T05:57:17+05:30 IST