Konaseemaలో నాలుగవ రోజు నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. విద్యార్థుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-05-28T14:05:58+05:30 IST

జిల్లాలో వరుసగా నాలుగవ రోజు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

Konaseemaలో నాలుగవ రోజు నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. విద్యార్థుల ఇక్కట్లు

కోనసీమ: జిల్లాలో వరుసగా నాలుగవ రోజు ఇంటర్నెట్ సేవలు(Internet services) నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రేపు ఏపీ పాలిసెట్(Polyset) పరీక్ష జరుగనుంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 2,500 మంది వరకు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్నెట్ సేవలు లేక హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏం చేయాలో తెలియక విద్యార్థులు కన్నీళ్ళు పెడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలో అల్లర్ల నేపథ్యంలో అధికారులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-05-28T14:05:58+05:30 IST