రాజంపేట పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దొంగలు

ABN , First Publish Date - 2020-09-27T21:30:02+05:30 IST

21 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...

రాజంపేట పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర దొంగలు

కడప: 21 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ మేడా మలికార్జునరెడ్డి ఇంటి వద్ద రెక్కీ చేస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా దొంగల నుంచి రూ.10,360, ఒక పిస్టల్, నాలుగు బుల్లెట్లు, కారు, 3 బైక్‌లు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల ముఠా గతంలో బళ్ళారి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో పలు దోపిడీలకు పాల్పడిందని, జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడేందుకు ఈ ముఠా స్కెచ్ వేసిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

Updated Date - 2020-09-27T21:30:02+05:30 IST