ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2021-05-11T05:28:51+05:30 IST
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు
కడ్తాల్: మండల పరిషత్లో సోమవారం ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపీడీవో రామకృష్ణ అధ్వర్యంలో నిర్వహించిన ఎంపీపీ కమ్లీమోత్యనాయక్, జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలకు 49 మంది హాజరయ్యారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులందరికీ రుణాలు అందేలా చూస్తామని ఎంపీపీ కమ్లి, జడ్పీటీసీ దశరథ్ అన్నారు. 2020-21కి సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంటర్వ్వూలు నిర్వహించినట్లు ఎంపీడీవో తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో తేజ్సింగ్, బ్యాంకు మేనేజర్లు సతీశ్, సంజయ్రెడ్డి, సైదులు, శివప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివా్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.