కరోనాతో రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి
ABN , First Publish Date - 2021-04-23T15:23:44+05:30 IST
కామారెడ్డి జిల్లా: రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీర్ ఇంతియాజ్ అలీ (58) కరోనాతో మృతి చెందారు.
కామారెడ్డి జిల్లా: రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీర్ ఇంతియాజ్ అలీ (58) కరోనాతో మృతి చెందారు. ఈనెల 15న మీర్ ఇంతియాజ్ అలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆయన వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. అప్పటి నుంచి మీర్ ఇంతియాజ్ అలీ అక్కడే చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు.