కలుషితాహారంపై విచారణ

ABN , First Publish Date - 2022-09-24T05:04:36+05:30 IST

మండలంలోని మిట్టపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ఈనెల 22న కేసరి తిని, పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవడంపై ఎంఈఓ ఖాదర్‌వలి, అకడమిక్‌ బృందం సభ్యులు డాక్టర్లు అజయ్‌, బాలాజీనాయక్‌, భానుప్రకా్‌షనాయక్‌ విచారణ చేపట్టారు.

కలుషితాహారంపై విచారణ

ఓబుళదేవరచెరువు, సెప్టెంబరు 23: మండలంలోని మిట్టపల్లి బీసీ బాలుర వసతి గృహంలో ఈనెల 22న కేసరి తిని, పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవడంపై ఎంఈఓ ఖాదర్‌వలి, అకడమిక్‌ బృందం సభ్యులు డాక్టర్లు అజయ్‌, బాలాజీనాయక్‌, భానుప్రకా్‌షనాయక్‌ విచారణ చేపట్టారు. శుక్రవారం హాస్టల్‌లోని వంట గదులు, వసతిగృహం పరిసర ప్రాంతాలు, నీటి ట్యాంకులను పరిశీలించారు. వంట మనుషులతోపాటు, వార్డెన శంకరనతో వి వరాలను అడిగి, తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్‌ బృందం సిబ్బంది ఆజీజ్‌ఖాన, హెల్త్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి, కొత్తపల్లి ఇందిరమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:04:36+05:30 IST