రాజగోపుర ప్రారంభానికి మంత్రికి ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-04T05:11:03+05:30 IST
దేవితండాలోని జగదాంబ సేవాలాల్ ఆ లయంలో రాజగోపురం ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరుకావాలని గు రువారం మంత్రి సత్యవతి రాథోడ్కు తండావాసులు ఆహ్వానపత్రిక అందజేశారు.
ఇందల్వాయి, డిసెంబరు 3: దేవితండాలోని జగదాంబ సేవాలాల్ ఆ లయంలో రాజగోపురం ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరుకావాలని గు రువారం మంత్రి సత్యవతి రాథోడ్కు తండావాసులు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో 50 లక్షల రూపాయలతో రాజగోపురం నిర్మించామని తెలిపారు. ఈ ప్రతిష్ఠాపన మహోత్సవం ఈనెల 22వ తేదీన ఉన్నం దున జిల్లాలోని ప్రముఖులందరూ ఈ విచ్చేస్తున్నారని తెలిపారు. అనంతరం కార్యక్రమాని కి సంబంధించిన కరపత్రాలను గిరిజన సంక్షే మ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా గిరిజన రాష్ట్ర అధ్యక్షురాలు అనిత నాయక్, ఇం దల్వాయి ఎంపీపీ రమేష్ నాయక్, ఆలిండి యా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షు డు తుకారం నాయక్ పాల్గొన్నారు.