మైనార్టీ గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-05-07T05:37:29+05:30 IST
జిల్లాలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్లు ప్రిన్సిపల్ నారాయణగౌడ్ పేర్కొన్నారు.
కామారెడ్డిటౌన్, మే 6: జిల్లాలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వాని స్తున్నట్లు ప్రిన్సిపల్ నారాయణగౌడ్ పేర్కొన్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి అర్హతగల విద్యార్థుల నుంచి 5,6,7,8 తరగతులలో ప్రవేశానికి దరఖాస్తులను పాఠశాల లో స్వీకరిస్తున్నామని తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్ల కు గాను 60 సీట్లు మైనార్టీలకు, 20 సీట్లు నాన్ మైనార్టీ లకు ఉన్నాయని తెలిపారు. 6,7,8 తరగ తులలో బ్యాక్లా గ్ సీట్లకు మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను మే 20లోపు టీఎమ్ఆర్ ఈఐఎస్. తెలంగాణ.జీవోవి.ఇన్, పాఠశాలలో అందించాల ని తెలిపారు. జూన్ 1న లక్కిడ్రా ద్వారా సెలక్షన్ ఉంటుం దని తెలిపారు. మిగిలిన వివరాలకు 9441315327, 9959 206430 నంబర్లకు సంప్రదించాలని పేర్కోన్నారు.