దూర విద్య పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-04-20T04:32:42+05:30 IST
ఆంధ్రాయూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బీఏ, బీకాం కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్సు కోర్డినేటర్స్ డాక్టర్ జీఏ కల్యాణి, ఎ.ఈశ్వరమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం రూరల్: ఆంధ్రాయూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బీఏ, బీకాం కామన్ ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్సు కోర్డినేటర్స్ డాక్టర్ జీఏ కల్యాణి, ఎ.ఈశ్వరమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విద్యా ర్హత లేకపోయినా, 18 ఏళ్లు దాటిన వారు ఈ పరీక్ష రాసేం దుకు అర్హులని పేర్కొన్నారు. జూన్ 27న ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన దరఖా స్తులను ఎంఆర్ కళాశాల స్టడీ సెంటర్లో లభిస్తాయని తెలిపారు.