ఐపీఎల్ డబ్బు వల్లే.. సంబంధాలు దెబ్బతిన్నాయి!
ABN , First Publish Date - 2022-04-25T10:01:25+05:30 IST
తనకు మైకేల్ క్లార్క్కు మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ఐపీఎల్లో వచ్చిపడిన భారీ డబ్బే కారణమని ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ చెప్పుకొచ్చాడు.
న్యూఢిల్లీ: తనకు మైకేల్ క్లార్క్కు మధ్య సంబంధాలు దెబ్బతినడానికి ఐపీఎల్లో వచ్చిపడిన భారీ డబ్బే కారణమని ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ చెప్పుకొచ్చాడు. 2008 ఐపీఎల్ ఆవిర్భావ ఏడాది జరిగిన వేలంలో ఒకప్పటి డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ సైమండ్స్ను రూ.5.4 కోట్లకు కొనుగోలు చేసింది. ధోనీ (రూ. ఆరు కోట్లు) తర్వాత రెండో అత్యధిక ధర పలికిన క్రికెటర్ అప్పట్లో సైమండ్స్ కావడం గమనార్హం. ‘క్లార్క్, నేను సన్నిహిత మిత్రులం. కానీ ఐపీఎల్ తొలి సీజన్ వేలంలో నాకు లభించిన మొత్తంతో అతడు అసూయకు లోనయ్యాడని సైమండ్స్ చెప్పాడు. అలా ఐపీఎల్ మా ఇద్దరి సంబంధాలపై ప్రభావం చూపింది’ అని బ్రెట్ లీ పాడ్కా్స్టలో సైమండ్స్ తెలిపాడు.