కొవిడ్పై పోరుకు సన్రైజర్స్ విరాళం రూ. 30 కోట్లు
ABN , First Publish Date - 2021-05-11T09:17:02+05:30 IST
కొవిడ్ మహమ్మారిపై పోరుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళాన్ని ప్రకటించింది. తమ వంతుగా రూ. 30 కోట్లు
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారిపై పోరుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ భారీ విరాళాన్ని ప్రకటించింది. తమ వంతుగా రూ. 30 కోట్లు ఇవ్వనున్నట్టు సన్రైజర్స్ యాజమాన్యం సోమవారం ట్విటర్లో ప్రకటించింది. వివిధ స్వచ్చంద సంస్థలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న కొవిడ్-19 సహాయక చర్యలకు ఈ మొత్తం ఇవ్వనున్నట్టు ట్వీట్ చేసింది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పాటు పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు కొవిడ్పై పోరుకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.