భార్యకు కోర్టులో కొత్త ఉద్యోగం.. కోపంతో రగిలిపోయిన భర్త ఆమెను..

ABN , First Publish Date - 2020-09-19T22:28:00+05:30 IST

భార్యకు కోర్టులో ఉద్యోగం రావడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త ఆమెపై కోపంతో రగలిపోయాడు. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి తగల పెట్టేందుకు ప్రయత్నించాడు.

భార్యకు కోర్టులో కొత్త ఉద్యోగం.. కోపంతో రగిలిపోయిన భర్త ఆమెను..

కన్యాకుమారి: భార్యకు కోర్టులో ఉద్యోగం రావడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త ఆమెపై కోపంతో రగలిపోయాడు. భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి తగల పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆయితే ఆమె అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అప్రమత్తమవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింపోయింది. నిందితుడు సురేశ్ రాజన్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. కాగా.. ఆగస్టు 2 అతడి భార్య ఇఫ్షీబాయికి కోర్టులో ఉద్యోగం వచ్చింది. 


అయితే.. భార్య ఉద్యోగం చేయటం ఇష్టం లేని అతడు ఆమెపో కోపంతో రగిలిపోయాడు. ఆమెను వేధించడం ప్రారంభించిన అతడు ఇటీవల ఓ రోజు ఆమెను కూర్చీకి కట్టేశాడు. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రాణ భయంతో వణికిపోయిన ఆమె..పెద్ద పెట్టున కేకలు పెట్టండంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు బాధితురాలిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  


Updated Date - 2020-09-19T22:28:00+05:30 IST