ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తాం: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-06-25T04:35:32+05:30 IST

ప్రతీ ఎకరాకు సాగునీరందించి రైతుల కళ్లల్లో ఆనందం నింపా లన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

ప్రతీ ఎకరాకు సాగునీరందిస్తాం: ఎమ్మెల్యే
చిన్నగోప్లాపూర్‌ పంప్‌హౌజ్‌ నుంచి నీటిని విడుదల చేసి పూలు చల్లుతున్న ఎమ్మెల్యే చిట్టెం


మక్తల్‌రూరల్‌, జూన్‌ 24: ప్రతీ ఎకరాకు సాగునీరందించి రైతుల కళ్లల్లో ఆనందం నింపా లన్నదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మం డలంలోని చిన్నగోప్లాపూర్‌ పంప్‌హౌజ్‌, ఖానా పూర్‌ పంప్‌హౌజ్‌ల వద్ద పూజలు చేసి పూలు చల్లుతూ భూత్పూర్‌, సంగంబండ రిజర్వాయర్లకు ఆయన నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజీవ్‌ భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ, భూ త్పూర్‌ రిజర్వాయర్లను నీటితో నింపి నియోజక వర్గంలోని దాదాపు వంద చెరువులకు నీరందిస్తు న్నట్లు తెలిపారు. అలాగే, రిజర్వాయర్‌ల ఆయ కట్టు రైతులకు కూడా నీటిని అందిస్తున్నట్లు తెలి పారు. నియోజకవర్గంలోని ప్రతీ చెరువుకు నీరం దించి ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షను నెర వేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో ఎస్‌ఈ శివధర్మతేజ, ఈఈ సంజీవ్‌ ప్రసాద్‌, ఏఈలు నాగశివ, గాయత్రి, రహీం, డీఈ వెంకటరమణ, టీఆర్‌ఎస్‌ నాయకులు మహిపాల్‌ రెడ్డి, ఆనంద్‌, ఈశ్వర్‌యాదవ్‌లు ఉన్నారు. 

Updated Date - 2022-06-25T04:35:32+05:30 IST