ఇస్లామిక్ పండితుడు వహీదుద్దీన్ ఖాన్ మృతి
ABN , First Publish Date - 2021-04-23T08:06:59+05:30 IST
ప్రముఖ ఇస్లామిక్ పండితుడు, పద్మ విభూషణ్ మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (96) కన్నుమూశారు...
ప్రముఖ ఇస్లామిక్ పండితుడు, పద్మ విభూషణ్ మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (96) కన్నుమూశారు. ఆయన ఇటీవల కరోనా బారినపడ్డారు. సమాజంలో శాంతి సామరస్యం నెలకొల్పేందుకు, సంస్కరణలు తీసుకువచ్చేందుకు వహీదుద్దీన్ విశేష కృషి చేశారు. ఆ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. కాగా, వహీదుద్దీన్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.