ISIS : ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఇండియాలోకి...
ABN , First Publish Date - 2021-09-18T21:46:52+05:30 IST
ఐసిస్ ఇప్పుడు ఇండియా మీద కూడా సీరియస్గా దృష్టి పెట్టింది. నేరుగా కాకుండా తన అతివాదాన్ని సొషల్ మీడియా సైట్స్ ద్వారా వ్యాపింపజేస్తోంది...
ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో దారుణమైన హింసకాండకి కారణమైన ఐసిస్ ఎక్కడ వీలైతే అక్కడకి తన ఉన్మాదం విస్తరింపజేసే ప్రయత్నంలో ఉంది. ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయ్యాక మానవ బాంబులతో కాబూల్ ఎయిర్పోర్ట్ను రక్తిసిక్తం చేసింది. ఇక ఇప్పుడు ఇండియా మీద కూడా ఉగ్రవాద సంస్థ సీరియస్గా దృష్టి పెట్టింది. నేరుగా కాకుండా తన అతివాదాన్ని సొషల్ మీడియా సైట్స్ ద్వారా వ్యాపింపజేస్తోంది ఐసిస్.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రతినిధి అధికారిక వ్యాఖ్యల ప్రకారం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్రధాన సొషల్ మీడియా వేదికల ద్వారా ఉగ్ర సంస్థ అనేక మంది అమాయక యువతని హింస వైపు ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి 37 కేసుల్లో ఇప్పటికే 168 మందిని దేశ వ్యాప్తంగా అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ ప్రకటించింది.