కేజీబీవీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

ABN , First Publish Date - 2021-12-05T05:14:05+05:30 IST

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాల నియామకం భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

కేజీబీవీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 4: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాల నియామకం భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లా వ్యాప్తంగా కేజీబీవీల్లో సీఆర్టీ, పీజీటీ పోస్టులు మొత్తం 73 ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపాల్‌ పోస్టులు 8, సీఆర్‌టీ పరిధిలో తెలుగు-4, ఇంగ్లీషు 7, హిందీ 3, గణితం-3, ఫిజికల్‌ సైన్స్‌ 9, బయోలాజికల్‌ సైన్స్‌-9, సోషల్‌-9, ఉర్దూ-1, పీఈటీ-1 ఖాళీగా ఉన్నాయి. పీజీటీ పరిధిలో కెమిస్ట్రీ-7, బోటని-3, సివిక్స్‌-1, జీఎఫ్‌సీ-6, సీఎస్‌ఈ-1 రిటైల్‌ ఎంజీటీ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిసెంబరు 4 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి గడువు. ఈ నెల 9, 10 తేదీల్లో అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తారు. 11న దరఖాస్తుదారుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును డిస్‌ప్లే చేస్తారు. 11 నుంచి 14వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరిస్తారు. 16న అభ్యంతరాల పునఃపరిశీలన అనంతరం ఫైనల్‌ మెరిట్‌ లిస్టును ప్రకటిస్తారు. 18న ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి అదే రోజు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ను అందజేయనున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్‌ తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విధానం అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా చేయనున్నట్లు ఆయన తెలిపారు.


Updated Date - 2021-12-05T05:14:05+05:30 IST