ముంబై నుంచి బిహార్ కు సమస్యలను పార్శిల్ చేస్తాం : రౌత్

ABN , First Publish Date - 2020-09-26T19:12:28+05:30 IST

బిహార్ ఎన్నికల ప్రచారంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బిహార్ ఎన్నికల ప్రచారంలో

ముంబై నుంచి బిహార్ కు సమస్యలను పార్శిల్ చేస్తాం : రౌత్

ముంబై : బిహార్ ఎన్నికల ప్రచారంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రచారాస్త్రాలు లేవంటే చెప్పండి... ముంబై నుంచి పార్శిల్ చేస్తాం’’ అంటూ ఎన్డీయే కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బిహార్ ఎన్నికలు సుశాంత్ మరణం చుట్టే తిరుగుతున్నాయంటూ వస్తున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో రౌత్ పై వ్యాఖ్యలు చేశారు.


‘‘బిహార్ ఎన్నికలు అభివృద్ధి, శాంతిభద్రతలు, సుపరిపాలన చుట్టూ తిరగాలి. కానీ అవి లేకపోతే.. ముంబై నుంచి సమస్యలను పార్శిల్ చేస్తాం’’ అంటూ రౌత్ వ్యాఖ్యానించారు. బిహార్ లో పోటీపై అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని, వారిదే తుది నిర్ణయమని ఆయన తెలిపారు. బిహార్ లో కేవలం కులంతో పాటు మరికొన్ని అంశాల చుట్టే తిరుగుతాయని, కార్మిక చట్టాలు, కార్మికుల చుట్టూ తిరగవని రౌత్ విమర్శించారు. 

Updated Date - 2020-09-26T19:12:28+05:30 IST