ఆటోమేషన్ ఎఫెక్ట్.. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కోత
ABN , First Publish Date - 2021-06-17T03:43:26+05:30 IST
ఆటోమేషన్ కారణంగా భారత ఐటీ కంపెనీలు 2022 కల్లా 30 లక్షల ఉద్యోగులను తొలగిస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన నివేదికలో పేర్కొంది.
న్యూఢిల్లీ: ఆటోమేషన్ కారణంగా భారత ఐటీ కంపెనీలు 2022 కల్లా 30 లక్షల ఉద్యోగులను తొలగిస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల కంపెనీలకు ఏటా రూ. 7.3 లక్షల కోట్ల మేర ఖర్చులు మిగులుతాయని తెలిపింది. భారత్ ఐటీ రంగం ప్రస్తుతం 16 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. వీరిలో తొమ్మిది మిలియన్ల ఉద్యోగులు ప్రత్యేక నైపుణ్యాలు అవసరంలేని విధులు, బీపీఓ రంగంలో ఉన్నారు. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్, టెక్ మంహింద్రా వంటి సంస్థల్లో ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ రంగంలోని ఆటోమేషన్లో భాగంగా ప్రత్యేకమైన సాఫ్టవేర్లను వినియోగించడం ద్వారా సాధారణ పనులను సిబ్బంది అవసరం లేకుండానే చక్కపెట్టొచ్చు. దీని ద్వారా కంపెనీలు మానవవనరులను ఇతర ప్రత్యేకమైన బాధ్యతల వైపు మళ్లించే వీలు కలుగుతుంది.