వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యం
ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకంతో కాంగ్రె్సలో నూతన ఉత్తేజం ఏర్పడిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
మెదక్, జూలై 23 : టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకంతో కాంగ్రె్సలో నూతన ఉత్తేజం ఏర్పడిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మెదక్లోని జీకేఆర్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ నియోజకవర్గంలో త్వరలో అన్ని మండలాల్లో యువకులు, ఇతర పార్టీ నాయకులు కాంగ్రె్సలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో మెదక్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఎమ్మెల్యేగా రేవంత్రెడ్డికి బహుమతిగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మెదక్ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, అధికార ప్రతినిధి, కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పల్లె రాంచందర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్యాంసుందర్, కౌన్సిలర్ లింగం, నాయకులు పాల్గొన్నారు.