ఒత్తిళ్లకు తలొగ్గడం హేయం

ABN , First Publish Date - 2020-11-29T05:16:47+05:30 IST

వైసీపీ యూనియన్‌ ఒత్తిళ్లకు తలొగ్గి పట్ట ణంలోని డీఐ సెక్షన్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్‌.రామారావును నియమించడం హేయమైన చర్యని ఏపీఎస్‌ఈఈ 327 యూనియన్‌ సెక్రటరీ జి.సూర్యచంద్రరెడ్డి అన్నారు.

ఒత్తిళ్లకు తలొగ్గడం హేయం
ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేస్తున్న దృశ్యం

 

గుజరాతీపేట: వైసీపీ యూనియన్‌ ఒత్తిళ్లకు తలొగ్గి పట్ట ణంలోని డీఐ సెక్షన్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్‌.రామారావును నియమించడం హేయమైన చర్యని ఏపీఎస్‌ఈఈ 327 యూనియన్‌ సెక్రటరీ జి.సూర్యచంద్రరెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక ఏపీఈపీడీసీఎల్‌ జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టును నిబంధనల ప్రకారంభర్తీ చేయలేద న్నారు. దీనివల్ల బి.లోకనాథంకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామ న్నారు. కార్యక్రమంలో జి.రమేష్‌, సీహెచ్‌ పాపారావు,  కె.నాగరాజు, మల్లిబాబు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-11-29T05:16:47+05:30 IST