కోరుట్లలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం

ABN , First Publish Date - 2022-09-24T05:54:38+05:30 IST

రానున్న ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం లో కమలం జెండా ఎగురవేయడం ఖాయమని ఆదిలాబాద్‌ ఎంపీ సో యం బాపు రావు అన్నారు.

కోరుట్లలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం
మాట్లాడుతున్న ఎంపీ స్వయం బాపురావు

- ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపు రావు

మెట్‌పల్లి, సెప్టెంబరు 23: రానున్న ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం లో కమలం జెండా ఎగురవేయడం ఖాయమని ఆదిలాబాద్‌ ఎంపీ సో యం బాపు రావు అన్నారు. శుక్రవారం మెట్‌పల్లి పట్టణంలోని పలు కాలనీల్లో బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రాం తాల్లో భారీ ఎత్తున కమలనాథులు బైక్‌ ర్యాలీ జరిపారు. ఈ సందర్బంగా శాస్త్రీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడా రు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపి స్తానని లేకపోతే ఉరి వేస్కుంటానని రైతులకు హామీనిచ్చి మోసం చేసిన స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు హామీ మరిచిపోయార న్నా రు. టీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న హామీ ఏమైందన్నారు. రాష్ట్రలో ఉగ్రవాదుల కార్యక లాపాలు జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాలుగా నడుస్తున్నాయన్నా రు. మెట్‌పల్లి ప్రాంతంలో గతంలో బీజేపీ ఎమ్మెల్యేలు చెన్నమనేని విద్యా సాగర్‌ రావు, తుమ్మల వెంకటరమణ రెడ్డిలు చేసిన అభివృద్ధి మాత్రమే ప్రస్తుతం కనిపిస్తోందని, టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్య మన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయ మన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనా రాయణరావు, పట్టణాధ్యక్షుడు బొడ్ల రమేశ్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్‌, ని యోజకవర్గ నాయకులు డాక్టర్‌ జెఎన్‌ వెంకట్‌ సునిత, బద్దం గంగాదర్‌, సురభి నవీ న్‌, బీజేపీ పార్లమెంట్‌ జాయింట్‌ కన్వినర్‌ గుంటుక సదాశివ, ఇల్లెందుల శ్రీనివాస్‌, ఇల్లెందుల కృష్ణమాచారీ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెట్లపల్లి సుఖేందర్‌ గౌడ్‌, కౌన్సిలర్‌ మర్రి పోచయ్య, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ స భ్యుడు దొనికెల నవీన్‌, నాయకులు గంప శ్రీనివాస్‌, డాక్టర్‌ యాదగిరి, మన్నె గంగాధర్‌, సుంకెట్‌ విజయ్‌, పాంపట్టి ఆనంద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:54:38+05:30 IST