‘అవాస్తవాలు మాట్లాడటం ప్రతిపక్షాలకు తగదు’
ABN , First Publish Date - 2022-01-24T05:13:42+05:30 IST
‘అవాస్తవాలు మాట్లాడటం ప్రతిపక్షాలకు తగదు’
కందుకూరు జనవరి 23: టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తోందంటూ అవాస్తవాలు మాట్లాడటం ప్రతిపక్షాలకు తగదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 48 శాతం అప్పులతో జమ్మూకాశ్మీర్ ఆగ్రస్థానంలో ఉ ండగా తెలంగాణ 16.1శాతంతో చివరి స్థానంలో ఉందన్నారు. కానీ తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం రాజకీయ లబ్ధికోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నా రు. దేశంలోని చాలా రాష్ట్రాలకు రుణాలిచ్చే సంస్థలు అప్పులు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థి తి లేకుండా సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్తతోనే పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని ఈ సందర్భంగా కప్పాటి అన్నారు.