విలాసాల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం తగదు

ABN , First Publish Date - 2021-12-02T05:59:47+05:30 IST

విలాసాల కోసం రైతులను స్థానిక ప్రజాప్రతినిధి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేగోనుగుంట్ల సూర్యనారాయణ విమ ర్శించారు.

విలాసాల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం తగదు
గంగపూజ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

- మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ

ధర్మవరం, డిసెంబరు 1: విలాసాల కోసం రైతులను స్థానిక ప్రజాప్రతినిధి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేగోనుగుంట్ల సూర్యనారాయణ విమ ర్శించారు. బుధవారం ధర్మవరం చెరువు మొదటి మరువ వద్ద ఆయన గంగపూజ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధి తన ఎస్టేట్‌కు వెళ్లడానికి నీరు ఉండాలని స్వార్థంతో ఆయకట్టు రైతులకు నీటిని వదలకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 2017లో అప్పటి ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు సహకారంతో హంద్రీనీవాకాలువ ద్వారా ధర్మవరం చెరువును నింపడం జరిగిందన్నారు. మూడు నెలల పాటు కాలువల గట్లపై పోలీసు బందోబస్తు నిర్వహించి చెరువుకు నీటిని తీసుకువచ్చామన్నారు. దీంతో ఆయకట్టుకింద ఉన్న రైతులకు పంటలు పండిం చుకోవడానికి నీటిని కూడా దిగువకు వదలడం జరిగిందన్నారు. రైతులు కూడా పంటలు సాగుచేసి పడించుకున్నారన్నారు. అప్పట్లో వర్షాలు రాకపోయిన కృష్ణజ లాలను చెరువు తీసుకురావడం జరిగిందన్నారు. ఇప్పటికైన  ఎవరూ నిస్వార్థంగా పనిచేస్తారో ఎవరూ దోపిడీ చేస్తారో ప్రజలే గమనించాల్సిన అవసరం ఉందన్నారు. 


Updated Date - 2021-12-02T05:59:47+05:30 IST