మార్స్క్ భవన్కు నోటీసులు ఇవ్వడం సరికాదు
ABN , First Publish Date - 2022-01-23T03:34:01+05:30 IST
సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం అయిన మార్క్స్ భవన్కు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరికాదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాల్కుమార్, నాయకురాలు అందె మం గలు పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 22: సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం అయిన మార్క్స్ భవన్కు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం సరికాదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర లాల్కుమార్, నాయకురాలు అందె మం గలు పేర్కొన్నారు. శనివారం సీపీఐ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నాయకుడు తుల మధుసూదన్ ఫిర్యా దును ఆధారంగా చేసుకుని మున్సిపల్ అధికారులు తమ పార్టీ కార్యాలయం మార్క్స్ భవన్కు నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. యేటా పన్నులు చెల్లిస్తున్నామని, పట్టా కూడా ఉందని తెలిపారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాం తంపై పోరాటాలు చేస్తే తాము సహకరిస్తామని, పార్టీ ముసుగులో నాయకుల ను లక్ష్యంగా చేసుకుని ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సదరు వ్యక్తిపై అధికారులు విచారణ జరిపించాలని, తాము ఆక్రమణకు పాల్పడితే ఏ శిక్షకైనా సిద్దమన్నారు. జిల్లా నాయకులు తోకల తిరుపతి, మల్లన్న,నరేందర్, మక్బుల్, శ్రీకాంత్, జ్యోతి పాల్గొన్నారు.