‘అక్రమ కేసులు పెట్టడం సరికాదు’

ABN , First Publish Date - 2022-06-25T05:54:36+05:30 IST

గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన గిరిజన మహిళపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఆ కేసులను ఎత్తివేయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్‌ డిమాండ్‌ చేశారు.

‘అక్రమ కేసులు పెట్టడం సరికాదు’
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 24: గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన గిరిజన మహిళపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఆ కేసులను ఎత్తివేయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్‌ డిమాండ్‌ చేశారు. నంద్యాల కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం గిరిజన సమాఖ్య నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. రాజు నాయక్‌ మాట్లాడుతూ రేషన్‌ డీలర్‌షిప్‌ను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న శోభారాణిబాయి కుటుంబంపై కేసులు బనాయించడం సమంజసం కాదని అన్నారు. వేధించిన పోలీసులు, అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జేసీ మౌర్యకు వినతి పత్రం అందజేశారు. 


Updated Date - 2022-06-25T05:54:36+05:30 IST