అంబులెన్స్లను అడ్డుకోవడం దుర్మార్గం
ABN , First Publish Date - 2021-05-11T05:01:43+05:30 IST
ఏపీ నుంచి కొంతమంది అత్యవసర చికిత్సకు అంబులెన్స్ల ద్వారా హైదరాబాదుకు వెళుతుండగా రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకోవడం దుర్మార్గమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడి ప్రకటనలో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
కడప(ఎడ్యుకేషన్), మే 10: ఏపీ నుంచి కొంతమంది అత్యవసర చికిత్సకు అంబులెన్స్ల ద్వారా హైదరాబాదుకు వెళుతుండగా రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకోవడం దుర్మార్గమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడి ప్రకటనలో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం మరో మూడేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందని, నగరంలోకి వెళ్లనీయకుండా సరిహద్దుల్లో అడ్డుకోవడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విభజన చట్టంలోని నిబంధనలు అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు విడుదల చేయాలని కోరారు.