చంద్రబాబు ఉన్నప్పుడే బాగుండె..జగన్ ఏడిపిస్తున్నాడు
ABN , First Publish Date - 2022-05-28T09:00:11+05:30 IST
చంద్రబాబు ఉన్నప్పుడే బాగుండె..జగన్ ఏడిపిస్తున్నాడు
ఎమ్మెల్యేను నిలదీసిన వృద్ధ దంపతులు
బుక్కరాయసముద్రం, మే 27: ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బాగుండె. ఇప్పుడు జగన్ ఏడిపించి ఏడు గుటకల నీళ్లు తాపిస్తున్నాడు. పురుగుల మందుతాగి సచ్చిపోవడం ఒక్కటే మార్గం’ అని వృద్ధ దంపతులు శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మను నిలదీశారు. అనంతపురం జిల్లా చెదళ్ల గ్రామంలో ప్రజాప్రతినిధులు..హనుమంతరెడ్డి, రత్నమ్మ దంపతులను పలుకరించారు. వృద్ధాప్యంలో ఉన్న వారిద్దరూ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎవరికి కావాలి? మాకు ఉపాధి చూపించాలి అంటూ ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.