వైసీపీకి ఈ సారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-28T23:38:46+05:30 IST

వైసీపీకి ఈ సారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప: చంద్రబాబు

వైసీపీకి ఈ సారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప: చంద్రబాబు

అమరావతి: అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఏం సాధించాడని జగన్ మళ్లీ గెలుస్తారని, వైసీపీకి ఈ సారి సింగిల్ డిజిట్ వస్తేనే గొప్ప అని పార్టీ నేతలతో సమావేశంలో సీఎం జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. నెత్తిన పెట్టుకున్న వైసీపీ కుంపటిని ఎప్పుడు దింపెయ్యాలా అని జనం చూస్తున్నారని తెలిపారు. ఏ రంగంలో అయినా నాడు- నేడుపై చర్చకు టీడీపీ సిద్దమని చెప్పారు. నియోజకవర్గాల్లో సమాంతర వ్యవస్థలు నడిపితే కుదరదని, టీడీపీ నిరసనలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో జగన్ ఉలిక్కిపడ్డారని విమర్శించారు. ఎన్నికల్లో ఒటమి తప్పదని జగన్‌కు అర్థం అయ్యిందని.. దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ను మళ్లీ ఎందుకు గెలిపిస్తారని, పన్నులతో ప్రజలను బాధినందుకా.. ఇరిగేషన్, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసినందుకా?, తన వైఫల్యాలతో పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులను బలిచేసినందుకా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక నియోజకవర్గ ఇంచార్జ్...ఇంకో నియోజకవర్గంలో వేలు పెట్టడానికి వీలులేదని, నియోజకవర్గంలో ఇంచార్జ్‌కు వ్యతిరేకంగా గ్రూపులు కడితే సహించేది లేదని....ఇంచార్జ్ కూడా అందరినీ కలుపుకుని పని  చేయాల్సిందే అని చంద్రబాబు చెప్పారు. ఈ మూడేళ్లు బయటకు రాని కొందరు నేతలు...ఇప్పుడు తెలుగు దేశం గెలుపు ఖాయం అని తెలిసి యాక్టివ్ అవుతున్నారని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-04-28T23:38:46+05:30 IST