ఐటీడీఏలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ABN , First Publish Date - 2020-11-27T06:01:04+05:30 IST
స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేకతను వివరించారు.
పాడేరు, నవంబరు 26: స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్ రాజ్యాంగ దినోత్సవం ప్రత్యేకతను వివరించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్.ప్రభాకరరావు, ఏవో నాగేశ్వరరావు, గిరిజన సంక్షేమ విద్యా శాఖ డీడీ జి.విజయకుమార్, ఇంజనీరింగ్ శాఖ ఈఈ కేవీఎస్ఎన్.కుమార్, వెలుగు ఏపీడీ నాగేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.