డాక్టర్ వీరబ్రహ్మయ్యకు ఐవీఏ అవార్డు
ABN , First Publish Date - 2021-06-21T06:34:52+05:30 IST
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గైనకాలజీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కె.వీరబ్రహ్మయ్యకు ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ (ఐవీఏ) అవార్డు లభించింది.
తిరుపతి(విద్య), జూన్ 20: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ గైనకాలజీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ కె.వీరబ్రహ్మయ్యకు ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ (ఐవీఏ) అవార్డు లభించింది. ఐవీఏ ఆధ్వర్యంలో వెటర్నరీ వృత్తిలో సవాళ్లు అనే అంశంపై అన్లైన్లో శని, ఆదివారాలు రెండ్రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాబ్లోని గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం నిర్వహించిన సదస్సులో బ్రహ్మయ్య సేవలను గుర్తించి బెస్ట్ వెటర్నరీ అవార్డుకు ఎంపికచేశారు.