ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-11-30T04:54:30+05:30 IST

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి
సంఘీభావం తెలుపుతున్న ఔట్‌సోర్సింగ్‌ జేఏసీ ఉద్యోగ సంఘ నేతలు

ఏపీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ జేఏసీ ఆవిర్భావం


గుంటూరు, నవంబు 29 (ఆంధ్రజ్యోతి):  రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని జేఏసీ చైర్మన్‌ కె.సుమన్‌ కోరారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని ఉద్యానశాఖ కార్యాలయం మీటింగ్‌ హాల్‌లో ఆదివారం ఏపీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ ఆవిర్భావ సభ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న 60 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. జేఏసీ చైౖర్మన్‌గా ఎన్నికైన సుమన్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తాత్కాలిక, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు చట్టభద్రత కల్పించాలన్నారు. 

Updated Date - 2020-11-30T04:54:30+05:30 IST