టెర్రరిస్టుల కన్నా ఆర్ఎస్ఎస్ ప్రమాదకరం: గజ్జల కాంతం

ABN , First Publish Date - 2021-01-25T17:37:53+05:30 IST

తీవ్రవాదులు, ఉగ్రవాదుల కన్నా ఆర్ఎస్ఎస్ చాలా ప్రమాదకరమని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరీంనగర్‎లో...

టెర్రరిస్టుల కన్నా ఆర్ఎస్ఎస్ ప్రమాదకరం: గజ్జల కాంతం

కరీంనగర్:  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టుల కన్నా ఆర్ఎస్ఎస్ చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఆర్ఎస్ఎస్‎ను నిషేధించాలన్నారు. రామమందిర నిర్మాణ కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసిందని, చిత్తశుద్ధి ఉంటే రామమందిర నిర్మాణానికి వెయ్యికోట్లు ఇవ్వాలని గజ్జల కాంతం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-25T17:37:53+05:30 IST