నల్లగొండ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

ABN , First Publish Date - 2021-05-09T14:41:52+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందిజ కరోనా విజృంభణ

నల్లగొండ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత

నల్లగొండ : జిల్లాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉందిజ కరోనా విజృంభణ నేపథ్యంలో చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలు ఆలయ అధికారులు నిలిపివేశారు. ఈ నెల 11వ తేదీన అమావాస్య సందర్భంగా పూజలకు పేరుగాంచిన రామలింగేశ్వర స్వామి ఆలయంగా భక్తులు పూజిస్తారు. అయితే.. నేటి నుంచి 18వ తేదీ వరకు ఆలయంలో భక్తులకు అనుమతి ఉండదని దేవస్థానం చైర్ పర్సన్ అరుణ రాజిరెడ్డి ప్రకటించారు.

Updated Date - 2021-05-09T14:41:52+05:30 IST