Electricity సంస్కరణలపై మంత్రి Jagadish Reddy స్పందన
ABN , First Publish Date - 2022-07-07T21:31:31+05:30 IST
విద్యుత్ (electricity) సంస్కరణలపై మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు.
సూర్యాపేట (Suryapet): విద్యుత్ (electricity) సంస్కరణలపై మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం వైఖరి ముమ్మాటికి మోసపురితమేనని విమర్శించారు. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించాకే ఆ లీకేజీలని విమర్శించారు. సంస్కరణలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ (CM KCR) లేఖ ద్వారా తెలిపారన్నారు. వ్యవసాయ చట్టాలను మళ్ళీ పెడతామంటూ బీజేపీ నేతలు (BJP Leaders) చెబుతున్నారని, విద్యుత్ సంస్కరణల అంశంలోనూ కేంద్రం అదే వైఖరితో ఉందన్నారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటివని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.