బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు: మంత్రి జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2022-03-01T20:44:46+05:30 IST
బండి సంజయ్ పాదయాత్ర దండగ యాత్రని మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు.
సూర్యాపేట: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర దండగ యాత్రని మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచామని ప్రజలకు చెప్పేందుకు వెళ్తారా? అని నిలదీశారు. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీలో ప్రజలను అడిగితే..వాళ్లే చెప్తారు బీజేపీ చెత్త పాలన గురించని మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇక దేశంలో బీజేపీ ఆటలు సాగవని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు.