స్టీల్ప్లాంట్పై జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు: ధర్మాన
ABN , First Publish Date - 2021-03-06T21:28:40+05:30 IST
జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న సానుభూతి చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.
రాజమండ్రి: జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న సానుభూతి చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. స్టీల్ప్లాంట్పై జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పినా.. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధర్మాన తప్పుబట్టారు.