ప్రజలపై Jagan సైకోలను వదిలారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-05-18T21:04:24+05:30 IST
ప్రజలపై సీఎం జగన్ (Jagan) సైకోలను వదిలారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
అమరావతి: ప్రజలపై సీఎం జగన్ (Jagan) సైకోలను వదిలారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ సైకోలనూ వదలం.. వడ్డీతో సహా తీర్చుకుంటామని హెచ్చరించారు. బుధవారం చంద్రబాబు (Chandrababu) మీడియాతో మాట్లాడుతూ సొంత నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వలేని సీఎం రాష్ట్రాభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నందునే అప్పులు పుట్టలేదని తెలిపారు. తప్పులు ఎత్తిచూపితే ఎల్లో మీడియా ముద్ర వేస్తున్నారని చెప్పారు. జగన్ శాడిజం, అరాచకం, విధ్వంసాన్ని ప్రజలు చూస్తున్నారని హెచ్చరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే ఆలోచించి ఉంటే.. జగన్ ఇడుపులపాయ దాటి బయటికి వచ్చేవాడు కాదన్నారు. మాజీమంత్రి వివేకా హత్య విషయంలో జగన్ విశ్వసనీయత ప్రజలకు తెలిసిపోయిందన్నారు. వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు కూడా ప్రజావ్యతిరేకంగా పనిచేస్తున్నారని చంద్రబాబు తప్పుబట్టారు.