కాకాణికి, అనిల్కుమార్కు జగన్ క్లాస్!
ABN , First Publish Date - 2022-04-21T02:23:49+05:30 IST
నెల్లూరు వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికి, మాజీ మంత్రి అనిల్ కుమార్కు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: నెల్లూరు వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికి, మాజీ మంత్రి అనిల్ కుమార్కు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి, మాజీ మంత్రితో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇద్దరు సమన్వయంతో పనిచేయలని జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట సీఎంతో కాకాణి, అనిల్ విడివిడిగా భేటీ అయ్యారు. తర్వాత ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టి జగన్ మాట్లాడారు. భేటీ తరువాత అనిల్ను జగన్ మరోసారి పిలిపించుకుని మాట్లాడారు. ఇంత జరిగినా నెల్లూరులో ఫ్రెండ్లీ వాతావరణం ఉందని కాకాణి చెప్పడం గమనార్హం. నెల్లూరులో ఎవ్వరి ఫ్లెక్సీలను ఎవ్వరూ చించలేదని, అనిల్ అనుచరులు చించారని మీరెలా చెపుతారంటూ మీడియాకు పొంతన లేని సమాధానాలిచ్చారు. ఇద్దరిని ఒకేసారి పిలవడం యాదృచ్చికమని కాకాణి చెప్పారు.