అప్పటికీ, ఇప్పటికీ మార్పును గమనించండి: jagan

ABN , First Publish Date - 2022-06-14T18:16:04+05:30 IST

నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటిస్తున్నారు.

అప్పటికీ, ఇప్పటికీ మార్పును గమనించండి: jagan

శ్రీసత్యసాయి : నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నిండుగా ఉన్నాయన్నారు. అప్పటికీ, ఇప్పటికీ మార్పును గమనించాలని కోరుతున్నానన్నారు. ఇప్పుడు ఒకే సీజన్లో బీమా సొమ్మును ఇస్తున్నామన్నారు. టీడీపీ ఐదేళ్లలో బీమా కింది ఇచ్చింది రూ.3,411 కోట్లు మాత్రమేనని.. వైసీపీ పాలనలో మూడేళ్లలోనే రూ.6,684 కోట్లు ఇచ్చామన్నారు. రైతులకు మేలు చేయడంలో దేశంలో పోటీ పడుతున్నామన్నారు. 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు.. రూ.2,977 కోట్లు బీమా పరిహారం ఇచ్చామన్నారు. ఇప్పటి వరకూ మొత్తం 44.28 లక్షల మంది రైతులకు.. రూ.6,684 కోట్లు పంటల బీమా సాయం అందించినట్టు జగన్ తెలిపారు.


Updated Date - 2022-06-14T18:16:04+05:30 IST