కరోనా నియంత్రణలో జగన్ విఫలం: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-08-23T21:41:22+05:30 IST
కరోనా నియంత్రణలో జగన్రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు.
అమరావతి: కరోనా నియంత్రణలో జగన్రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. కరోనా సమయంలోనూ పన్నులు, ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. అప్పు తెచ్చిన రూ.2 లక్షల కోట్లు ఏం చేశారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. అవినీతి, దుబారాతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు అందడం లేదని తప్పుబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. జగన్రెడ్డి మోసాలను రెండేళ్లలోనే ప్రజలు గ్రహించారని, నీలిమీడియా అబద్ధపు ప్రచారం నుంచి ప్రజలు బయటపడుతున్నారని తెలిపారు. సరైన సమయంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.