AP News: ఏపీని జగన్ గంజాయిప్రదేశ్గా మార్చారు: గుమ్మడి సంధ్యారాణి

ABN , First Publish Date - 2022-09-29T23:21:01+05:30 IST

ఏపీని సీఎం జగన్ (CM Jagan) గంజాయిప్రదేశ్గా మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి దుయ్యబట్టారు.

AP News: ఏపీని జగన్ గంజాయిప్రదేశ్గా మార్చారు: గుమ్మడి సంధ్యారాణి

అమరావతి: ఏపీని సీఎం జగన్ (CM Jagan) గంజాయిప్రదేశ్గా మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి దుయ్యబట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గంజాయి రవాణాలో ఏపీది మొదటి స్ధానంలో ఉందని తప్పుబట్టారు. 2021లో దేశ వ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయి పట్టుబడితే.. 2 లక్షల కిలోలకుపైగా ఏపీలోనే పట్టుబడిందని తెలిపారు. రుషికొండ.. బోడికొండ అవుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం అవుతారని, సీఎం జగన్కు బుద్ది చెబుతారని సంధ్యారాణి హెచ్చరించారు.


దేశంలోనే గంజాయి సరఫరా (Supply of cannabis)లో ఏపీ (AP) మొదటి స్థానంలో ఉంది. తాజాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (Bureau of Narcotic Control) 2021 నివేదికను విడుదల చేసింది. గత ఏడాది మాదకద్రవ్యాల (Drugs)పై ఎన్సీబీ (NCB) నివేదికను వెలువరించింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) నుంచి 26% గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Updated Date - 2022-09-29T23:21:01+05:30 IST