Chandrababu: సీఎం ఓ సైకో.. ఇంటికో సైకోను తయారు చేస్తున్నారు...

ABN , First Publish Date - 2022-08-26T21:09:02+05:30 IST

సీఎం జగన్ ఓ సైకో అని, ఇంటికో సైకోను తయారు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Chandrababu: సీఎం ఓ సైకో.. ఇంటికో సైకోను తయారు చేస్తున్నారు...

చిత్తూరు జిల్లా (Chittoor dist.): ఇసుక (Sand), వైన్స్ (Wine), మైన్స్‌ (Mines)పై వైసీపీ (YCP) దొంగలు కన్నేశారని, వైసీపీ నేతలు బాగా దోచుకుతిన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. కుప్పం (Kuppam)లో మూడో రోజు శుక్రవారం పర్యటిస్తున్న ఆయన కృష్ణదాసనపల్లెలో మాట్లాడుతూ... సీఎం జగన్ (CM Jagan) ఓ సైకో (Psycho) అని, ఇంటికో సైకోను తయారు చేస్తున్నారని అన్నారు. తండ్రి వైఎస్‌ను అడ్డుపెట్టుకుని రూ. లక్షల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. ఆ ఆస్తులను కాపాడుకునేందుకు ఆయనకు పదవి కావాలని అన్నారు. వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిన్న సివిల్‌ డ్రెస్సులో పోలీసులు కర్రలు తీసుకుని వచ్చారని, వాళ్లు, వాళ్లను ప్రోత్సహించినవారు ఎవరో తెలియాలని, కేసులు వేసి.. వారి పని పడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది కోతల, రోతల ప్రభుత్వమని, పింఛన్లు కట్ చేస్తున్నారని, కార్డులు తీసేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

Updated Date - 2022-08-26T21:09:02+05:30 IST