AP News: గోరంట్ల వ్యవహారంపై జగన్ స్పందించాల్సిందే: రఘురామకృష్ణరాజు
ABN , First Publish Date - 2022-08-13T21:33:07+05:30 IST
Delhi: ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) న్యూడ్ వీడియోపై ప్రతిపక్షాల దాడి ప్రభుత్వంపై కొనసాగుతూనే ఉంది. ఆ వీడియో ఒరిజినలేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్
Delhi: ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupur MP Gorantla Madhav) న్యూడ్ వీడియోపై ప్రతిపక్షాల దాడి ప్రభుత్వంపై కొనసాగుతూనే ఉంది. ఆ వీడియో ఒరిజినలేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని తెలుగుదేశం (TDP) నాయకులు బలంగా వాదిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghurama Krishna Raju) కూడా ఎంపీ గోరంట్ల విషయంపై స్పందించారు. పార్టీని కాపాడుకోవాలనుకుంటే గోరంట్లపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. గోరంట్ల వ్యవహారంపై సీఎం జగన్ స్పందించకపోతే కుదరదని, మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఫలితంగా అది పార్టీకి నష్టమని పేర్కొన్నారు. ఇప్పటికైనా గోరంట్ల వ్యవహారంపై జగన్ చర్యలు తీసుకోకపోతే..వైసీపీకి ఒక్క మహిళ కూడా ఓటు వేయరని పేర్కొన్నారు.