జగన్‌ రెడ్డి పాలనలో జనాలపై బాదుడే. బాదుడు..

ABN , First Publish Date - 2022-06-28T05:18:42+05:30 IST

వైసీపీ పాలనలో జనంపై ధరల బాదుడు మోగుతోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఒంగోలు నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక 20వ డివిజన్‌లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. నిత్యావసర ధరల నుంచి పెట్రోలు, గ్యాస్‌, డీజిల్‌, సిమెంట్‌, ఇసుక, కూరగాయల ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల మోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్నారు.

జగన్‌ రెడ్డి పాలనలో జనాలపై బాదుడే. బాదుడు..
ఒంగోలు భాగ్యనగర్‌లో బాదుడే బాదుడు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ శ్రేణులు

- 20వ డివిజన్‌లో టీడీపీ నిరసన 

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 27 : వైసీపీ పాలనలో జనంపై ధరల బాదుడు మోగుతోందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఒంగోలు నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక 20వ డివిజన్‌లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. నిత్యావసర ధరల నుంచి పెట్రోలు, గ్యాస్‌, డీజిల్‌, సిమెంట్‌, ఇసుక, కూరగాయల ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల మోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్నారు. నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారన్నారు. నగరంలో నీటి సమస్య వేధిస్తుంటే పాలకవర్గం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రగతి సాధ్యపడుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా  ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, డివిజన్‌ నాయకుడు నల్లూరి అశోక్‌, గుర్రాల రాజ్‌ విమల్‌, మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, కామరాజుగడ్డ కుసుమ కుమారి, నాళం నరసమ్మ, పసుపులేటి సునీత, ఎల్టీ భవానీ, మేరి రత్నకుమారి, పలువురు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T05:18:42+05:30 IST