జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన జగన్
ABN , First Publish Date - 2022-07-11T23:58:45+05:30 IST
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
అమరావతి: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఆప్షన్ 3 కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. నెలాఖరులోగా కోర్టు వివాదాలు సరిచేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం చర్యలు తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు.