జగన్‌ పాలన అంతా జనంపై బాదుడే బాదుడు: టీడీపీ

ABN , First Publish Date - 2022-08-15T05:03:48+05:30 IST

జగన్‌ పాలన అంతా జనంపై బాదుడే బాదుడుగా సాగుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి తెలిపారు.

జగన్‌ పాలన అంతా జనంపై బాదుడే బాదుడు: టీడీపీ
సమావేశంలో మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి

సీకేదిన్నె, ఆగస్టు 14: జగన్‌ పాలన అంతా జనంపై బాదుడే బాదుడుగా సాగుతోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. ఆదివారం 17వ డివిజన్‌లో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత మూడేళ్లపాలనలో అన్ని ధరలూ పెంచేసి ప్రజలను మద్యానికి బానిసలు చేస్తోందన్నారు. టీడీపీ నాయకులు కృష్ణారెడ్డి, మోహన్‌బాబు, డి.వి.సుబ్బారెడ్డి, నరసింహులుయాదవ్‌, ఏటూరు రామచంద్రారెడ్డి, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T05:03:48+05:30 IST